About Vasavisatra Samudayam
వాసవీసత్ర సముదాయము పరిపాలకులు: శ్రీశైల క్షేత్ర నగర ఆల్ఇండియా ఆర్యవైశ్య అన్న సత్ర సంఘము , శ్రీశైలం అను పేరుతో 1956 సంవత్సరంలో రోడ్డు మార్గము లేక ముందు గార్దభాములపై సామాను తీసుకొని వెళ్లి శివరాత్రికి అన్నసత్ర ఏర్పాటు చేసినాము. తర్వాత 24-11-57 న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి చేత శంకుస్థాపన చేయబడి వసతి సత్ర నిర్మాణము చేస్తూ 25-12-62 తేదిన శ్రీ బచ్చు గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖామంత్రి గారిచే నిత్య అన్నసత్రము ప్రారంభించి వాసవి సత్రం, శ్రీ శైలం పేరుతో నడుపుచున్నాము.
వాసవీనివాస్: వాసవీనివాస్ పేరుతో పుట్టపర్తిలో 1.90 సెంట్లు భూమిని 20-08-1980 తారీఖున శ్రీశ్రీశ్రీ భగవాన్సత్యసాయిబాబా వారిచే శంఖుస్థాపన గావించబడి వసతిసత్ర నిర్మాణము జరుపుతూ 16-11-1995 తేదిన శ్రీ ఆత్మకూరు నాగభూషణం శెట్టి గారి చేత నిత్య సత్రం ప్రారంభించి నడుపుచున్నాము.